Jordan visit: జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:13 PM
భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన షురూ అయింది. దీనిలో భాగంగా ఇవాళ జోర్డాన్ చేరుకున్న ప్రధానికి అక్కడ సాదర స్వాగతం లభించింది. నేటి నుంచి ఈనెల 18 వ తేదీ వరకూ ప్రధాని.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: భారతీయ సంతతి భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన కృషి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జోర్డాన్ రాజధాని అమ్మాన్లో భారతీయ సంతతి నుంచి అపూర్వ స్వాగతం లభించింది.

ఇవాళ మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదటి జోర్డాన్కు చేరుకున్న ప్రధాని మోదీని హోటల్ వద్ద జోర్డాన్ లోని భారత సంతతికి చెందిన వారు భారత జాతీయ జెండాను చేతబట్టి ప్రధాని మోదీకి నమస్కరించి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రేమతో పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో పురాతన సంస్కృతిక సంబంధాలతో పాటు ఆధునిక ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్నది ప్రధాని పర్యటన ప్రధాన లక్ష్యం.

ప్రధాని మోదీ.. జోర్డాన్ సందర్శన భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్, ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్లతో భేటీ కానున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.

ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..