War Preparedness: యుద్ధం వస్తే 4 రోజులకే పాక్ శతఘ్ని గుండ్లు ఖాళీ
ABN , Publish Date - May 05 , 2025 | 04:30 AM
ఉక్రెయిన్కు శతఘ్ని గుండ్లు విక్రయించడంతో పాక్ వద్ద నిల్వలు క్షీణించాయని, నాలుగు రోజులు మాత్రమె సరిపోతాయని నివేదికలు వెల్లడించాయి. భారత్ దాడి చేస్తే పాక్కు తీవ్ర ఇబ్బందులు తప్పవని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ, మే 4: భారత్తో యుద్ధం వస్తే.. పాకిస్థాన్ వద్ద ఉన్న శతఘ్ని గుండ్ల నిల్వలు 4రోజులకే ఖాళీ అయిపోతాయని, ఆ దేశం ఇబ్బందుల్లో పడుతుందని సమాచారం. రష్యాతో యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్కు పాకిస్థాన్ భారీగా ఈ గుండ్లను విక్రయించడంతో.. నిల్వలు తగ్గిపోయాయి. నిజానికి ఏ దేశమైనా భూతల దాడులకు దిగాలన్నా.. శత్రువు దాడులను ఎదుర్కోవాలన్నా.. శతఘ్నులు, ఎం-109 హవిట్జర్లకు 155 ఎంఎం శతఘ్ని గుండ్లు, బీఎం-21 వ్యవస్థలకు సంబంధించిన 122 ఎంఎం రాకెట్లు చాలా అవసరం. వీటిల్లో పాక్ చాలా వరకు 155 ఎంఎంలను ఉక్రెయిన్కు విక్రయించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో.. ఈ నెల 2న జరిగిన పాకిస్థాన్ కోర్ కమాండర్ల సమావేశంలో 155 ఎంఎం శతఘ్ని గుండ్ల విషయంలో ఆందోళనలు వ్యక్తమైనట్లు సమాచారం. ‘‘96 గంటల్లోనే(నాలుగు రోజులు) మన వద్ద ఉన్న శతఘ్ని గుండ్ల నిల్వలు ఖాళీ అయిపోతాయి. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేయడం కూడా అంత సులభేమీకాదు’’ అని అధికారులు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఇప్పటికిప్పుడు భారత్ దాడి చేస్తే.. పాక్కు ఇబ్బందులు తప్పవని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News