Share News

Nirmala Sitharaman GST: మెరుగైన ప్రతిపక్షం కోసం ప్రజా ఉద్యమం రావాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:19 AM

ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. మన దేశంలో...

Nirmala Sitharaman GST: మెరుగైన ప్రతిపక్షం కోసం ప్రజా ఉద్యమం రావాలి

  • జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష నేతలవి అవగాహన లేని విమర్శలు

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఫైర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్షం, మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చిన తరహాలో దేశంలో మెరుగైన ప్రతిపక్షం, మెరుగైన ప్రతిపక్ష నేతల కోసం ఉద్యమం రావాల్సి ఉందని పేర్కొన్నారు. శనివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలపై నిర్మల విమర్శలు గుప్పించారు. ‘‘జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదట్లో 4శ్లాబులు పెట్టడం తప్పు అని, తాము చెప్పినట్టే ఇప్పుడు 2శ్లాబులకు తగ్గించారని కాంగ్రెస్‌ చెప్పడం తప్పు. జీఎస్టీ తేవడం, పన్ను శ్లాబుల నిర్ధారణ బీజేపీ ఒక్కదాని నిర్ణయం కాదు. అప్పటి కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడి సాధికార కమిటీ నిర్ణయం తీసుకున్నది అప్పటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అసిమ్‌ దాస్‌ గుప్తా అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి చర్చల్లోనే 4శ్లాబులను నిర్ణయించారు. ఇది ప్రతిపక్షాలకు తెలియదా? అవగాహన లేదా? ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. కానీ ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవం.


విషయం ఏమిటనేది అర్థం కానప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే మంచిది’’ అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా, దేశానికి హాని చేసేలా ఉన్నాయని.. అది మంచిది కాదని పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపు, రేట్ల మార్పు ప్రజా సంస్కరణలని, వాటి ప్రయోజనం ప్రతి కుటుంబానికి దక్కుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ప్రయోజనాలు ప్రజలకు అందేలా తాను వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇప్పటికే కార్ల తయారీ సంస్థలు, ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ సంస్థలు, దుస్తులు, పాదరక్షల సంస్థలు ధరల తగ్గింపును ప్రకటించాయని చెప్పారు. జీఎస్టీ మండలి భేటీలో రాష్ట్రాల ప్రతినిధులు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను వెల్లడించారని.. చివరికి ఏకగ్రీవంగా సంస్కరణలకు ఆమోదం తెలిపారని నిర్మల చెప్పారు. దీనితో దేశంలో సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరిందని, దీనిపై అభినందిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు లేఖ రాశానని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 06:19 AM