Mysterious Deaths: బద్దాల్ నుంచి 200 మంది రాజౌరీ ఆస్పత్రికి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:02 AM
జమ్మూ రాజౌరీ సమీపంలోని బద్దాల్ గ్రామంలో మిస్టరీ మరణాలపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నిరుడు డిసెంబరు నుంచి గ్రామంలోని మూడు కుటుంబాల్లో 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం, నలుగురు ఆస్పత్రిపాలవడం చర్చనీయాంశమైంది.

కశ్మీర్లో మరణాల మిస్టరీ..మృతదేహాల్లో విషపు ఆనవాళ్లు
జమ్మూ, జనవరి 24: జమ్మూ రాజౌరీ సమీపంలోని బద్దాల్ గ్రామంలో మిస్టరీ మరణాలపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నిరుడు డిసెంబరు నుంచి గ్రామంలోని మూడు కుటుంబాల్లో 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం, నలుగురు ఆస్పత్రిపాలవడం చర్చనీయాంశమైంది. ఈ మరణాలకు కారణాలు తెలియరాలేదు. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్లు జ్వరం, వాంతులతో బాధపడుతుండటంతో వారిని రాజౌరీలోని ఆస్పత్రిలో చేర్పించారు. బద్దాల్ నుంచి 200 మందిని రాజౌరీలోని ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గ్రామంలో పరిస్థితిని, అక్కడి ప్రజల కదలికలను నిశితంగా పర్యవేక్షించడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే గ్రామానికి నీళ్లు సరఫరా చేసే ట్యాంకులో పురుగుల మందు ఆనవాళ్లున్నాయని అనుమానాలు వ్యక్తం చేయడం ఆందోళన కలిగించింది. కాగా మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టుల్లో విషపు ఆనవాళ్లు లభ్యమైనట్లు లఖ్నవులోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన (సీఎ్సఐఆర్) టాక్సికాలజీ లాబొరేటరీ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News