గ్యాంగ్ రేప్ నిందితుల రోడ్ షో
ABN , Publish Date - May 24 , 2025 | 05:21 AM
గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్ శివారులో ఓ మహిళపై గ్యాంగ్రేప్ జరిగింది.

నలుగురి అరెస్ట్.. ముగ్గురి కోసం గాలింపు
బెంగళూరు, మే 23(ఆంధ్రజ్యోతి): గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్ శివారులో ఓ మహిళపై గ్యాంగ్రేప్ జరిగింది. ఈ కేసులో 19 మంది నిందితులు. వారిలో ఏడుగురు ప్రధాన నిందితులు. ఈ ఏడుగురు ఈ నెల 20న జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు 5కార్లతో అనుచరులతో రోడ్ షో చేస్తూ ఇళ్లకు వెళ్లారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో, ఆ నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురికోసం గాలిస్తున్నారు.