Leopard: మరో చిరుత సంచారం..
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:02 PM
రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.
- కుక్కపై దాడితో గ్రామంలో ఆందోళన
రాయచూరు(బెంగళూరు): రాయచూరు(Rayacgur) తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత(Leopard ) సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది. చిరుత సంచరించిన జాడలు అక్కడ కనిపించడంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు.

మూడు నెలల క్రితం డొంగరాంపూర్ పరమేశ్వర గుట్ట పై చిరుత ఒకటి నెమలి కుక్కల పై దాడి చేసి చంపివేయగా అటవి శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. తిరిగి మూడు నెలల అనంతరం చిరుత సంచారం కలకలం రేపుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News