Share News

ASER report: ‘నాడు-నేడు’.. ఫలితం మోడు!

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:03 AM

ప్రభుత్వ స్కూళ్లలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉండగా, 2022లో 10.5 శాతం, 2024లో 14.7 శాతానికి తగ్గారు.

ASER report: ‘నాడు-నేడు’.. ఫలితం మోడు!

జాతీయ సర్వే సంస్థ అసర్‌ నివేదికలోని ముఖ్యాంశాలు

6-14 ఏళ్ల చిన్నారుల హాజరుశాతం 2018లో 63.2 ఉండగా 2024లో 61.8 శాతానికి తగ్గింది.

ప్రభుత్వ స్కూళ్లలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉండగా, 2022లో 10.5 శాతం, 2024లో 14.7 శాతానికి తగ్గారు.

మూడో తరగతి చదువుతూ కనీసం తీసివేతలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 34.1 శాతం ఉండగా, 2022లో 29.2 శాతానికి తగ్గారు.

ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉండగా, 2022లో 37.9 శాతం, 2024లో 37.5 శాతానికి తగ్గారు. ఐదో తరగతి చదువుతూ భాగహారాలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 36.7 శాతం ఉండగా, 2022లో 27.3 శాతం, 2024లో 35.1 శాతానికి తగ్గారు.

ఎనిమిదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వారు 2018లో 78.6 శాతం ఉండగా, 2024లో 53 శాతానికి తగ్గారు.

తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూళ్లు 2018లో 58.1 శాతం ఉండగా, 2024 నాటికి 55.9 శాతానికి తగ్గాయి. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న స్కూళ్లు 2018లో 86.4 శాతం ఉండగా, 2024లో 78.4 శాతానికి తగ్గాయి.బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న స్కూళ్లు 2018లో 81.1 శాతం ఉండగా, 2024లో 77.2 శాతానికి తగ్గాయి.


పాఠశాలల్లో ఆఫీసులు, స్టోర్‌ రూం సౌకర్యాలు 2018లో 58.6 శాతం ఉండగా, 2024లో 51.4 శాతానికి తగ్గాయి. లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్లు 2018లో 91 శాతం ఉండగా, 2024లో 83.8 శాతంగా ఉంది.

2018లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న స్కూళ్లు 22.6 శాతం ఉండగా, 2024 నాటికి 19.2 శాతానికి తగ్గాయి. 2024లో 6-14 ఏళ్ల వారు ప్రభుత్వ స్కూళ్లలో 61.8 శాతం, ప్రైవేట్‌ స్కూళ్లలో 37.9 శాతం చేరారు.

1-5, 6-8 తరగతి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గింది. 2018లో 1-5 తరగతి అబ్బాయిలు 55.4 శాతం, అమ్మాయిలు 63.4 శాతం ఎన్‌రోల్‌ అవ్వగా, 2024లో అబ్బాయిలు 54.5 శాతానికి, అమ్మాయిలు 62.2 శాతానికి తగ్గిపోయారు.

6-8వ తరగతి పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ కూడా 2018తో పోలిస్తే 2024 నాటికి తగ్గిపోయింది. ఈ విభాగంలో 2018లో అబ్బాయిలు 68.7 శాతం, అమ్మాయిలు 70.2 శాతం ఎన్‌రోల్‌ అయ్యారు. 2024 నాటికి అబ్బాయిల శాతం 64.1 శాతానికి, అమ్మాయిల శాతం 67.1 శాతానికి తగ్గిపోయింది.


2024లో అన్ని పాఠశాలలను పరిశీలిస్తే 7, 8 తరగతులు చదివే పిల్లలు కనీసం అక్షరం కూడా చదవలేని స్థితిలో 2.2 శాతం మంది, అక్షరాలు చదవగలిగిన వాళ్లు 6.2 శాతం మంది ఉన్నారు. పదాలు చదవగలిగిన వాళ్లు ఏడో తరగతిలో 12.5 శాతం మంది, ఎనిమిదో తరగతిలో 10.7 శాతం మంది ఉన్నారు. ఈ తరగతుల్లో ఉన్న పిల్లల్లో ఒకటో తరగతి, రెండో తరగతి పాఠ్యపుస్తకాలు చదవగలిగిన వాళ్లు 50 శాతం ఉన్నారు.

14 ఏళ్ల వయసు గల వారిలో 69.7 శాతం పిల్లలు డిజిటల్‌ టాస్కులు చేస్తుంటే, 86.8 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు.

2024లో 3వ తరగతి చదువుతున్న పిల్లల్లో 3.2 శాతం మంది కనీసం అంకెలను కూడా గుర్తించలేకపోయారు. ఆరో తరగతి చదువుతూ అంకెలను గుర్తించలేని పిల్లలు 2.6 శాతం మంది ఉన్నారు. 2024లో ఐదో తరగతి చదువుతూ భాగహారం చేయలేని పిల్లలు 22.6 శాతం మంది, ఎనిమిదో తరగతి చదువుతూ భాగహారం చేయలేని విద్యార్థులు 42.8 శాతం మంది ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 03:03 AM