Chenab river: పాక్పై జలఖడ్గం
ABN , Publish Date - May 05 , 2025 | 05:02 AM
పాక్పై భారత్ జలఖడ్గాన్ని ప్రయోగిస్తూ చీనాబ్, జీలం నదులపై ఉన్న డ్యామ్ల నుంచి నీటి విడుదలను నిలిపివేసింది. ఈ చర్యలతో తాగునీటి, సాగునీటి కొరతకు గురైన పాక్ కంగారుపడి అణు యుద్ధం హెచ్చరికలు చేస్తున్నది.
బాగ్లిహార్ డ్యాం నుంచి నీళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ, మే 4: పాకిస్థాన్పై భారత్ జలఖడ్గాన్ని ప్రయోగించింది. జమ్మూకశ్మీరులోని రాంబాణ్ జిల్లాలో బాగ్లిహార్ డ్యాం నుంచి చీనాబ్ నదీ జలాల విడుదలను నిలిపివేసింది. జీలం నదిపై నిర్మించిన కిషన్గంగా డ్యాం నుంచి కూడా నీటి విడుదలను ఆపేయాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండూ హైడ్రో-ఎలక్ట్రిక్ డ్యాంలు. అవసరమైనప్పుడు నీటి విడుదలను నియంత్రించేందుకు భారత్కు ఇవి వీలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా బాగ్లిహార్ డ్యాంపై ఇరు దేశాల మధ్య మొదటి నుంచీ వివాదం ఉంది. దీని పరిష్కారానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వాన్ని కూడా పాక్ గతంలో కోరింది. జీలం నదికి ఉపనది అయిన నీలం నదిపై కిషన్గంగా డ్యాం నిర్మించారు. ఈ మూడు నదులూ పాక్కు జీవనాడి వంటివి. సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా ఇవే ఆధారం. దీంతో ఆ దేశం విలవిలలాడుతోంది. భారత్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం గాక పాక్ మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. భారత్పై అణుదాడి చేస్తామని బెదిరిస్తున్నారు. పాక్కు ప్రవహించే నదులపై ఇండియా ఎలాంటి కట్టడాలు కట్టినా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శనివారం హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News