Dogs: అబ్బో.. ఈ ఐడియా ఏదో బాగానే ఉందిగా.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:33 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు వీధి కుక్కల బారిన పడుతున్నారు. కుక్క కాటుకు సరైన వైద్యం పొందక రేబిస్తో మృతిచెందిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా, కుక్కలు ప్రజలపై దాడిచేయడం మాత్రం కొనసాగుతూనే ఉంది.
- నీలిరంగు నీటికి వీధికుక్కలు భయపడతాయా...
- హోసూరు ప్రజల వినూత్న ఆలోచన
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు వీధి కుక్కల బారిన పడుతున్నారు. కుక్క కాటుకు సరైన వైద్యం పొందక రేబిస్తో మృతిచెందిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా, కుక్కలు ప్రజలపై దాడిచేయడం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో, కృష్ణగిరి(Krishnagiri) జిల్లా హోసూరు పట్టణ ప్రజలు వీధి కుక్కల బెడద నుంచి కాపాడుకునేలా సరికొత్త ఆలోచన చేశారు.

హోసూరు(Hosur) కార్పొరేషన్ పరిధిలోని 45వ వార్డులో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్లే వారు వీధి కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంత ప్రజలు, దుస్తులు ఉతికేందుకు వినియోగించే నీలిరంగును నీటిలో కలిపి బాటిళ్లలో పోసి ఇళ్ల ముందుంచుతున్నారు. ఆ నీటిని చూసిన కుక్కలు భయపడి ఈ ప్రాంతానికి రావడం లేదని ప్రజలు తెలుపుతున్నారు.
నీలి రంగు బాటిల్ ట్రిక్ వీడియోను ఇక్కడ చూడండి
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News