High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..
ABN , Publish Date - May 01 , 2025 | 11:36 AM
High alert: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ సైనిక దళాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సరిహద్దు ప్రాంతాల ద్వారా భారత్లో అలజడులు సృష్టికి ఆస్కారం ఏర్పడే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ, మే 01: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ క్రమంలో పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద సైతం భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.

బంగ్లాదేశ్లో కొలువు తీరిన మహ్మద్ యూనస్ సర్కార్.. పాకిస్థాన్తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. అదీకాక బంగ్లాదేశ్లోని తీవ్రవాద వర్గాలతో సంబంధాలు బలోపేతం చేసుకొనేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశాయి. దీంతో బంగ్లాదేశ్ను స్థావరంగా చేసుకొని ఈ తీవ్రవాద గ్రూప్ల ద్వారా భారత్లో అలజడులు రేపే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు ప్రాంతంలో గస్తీని మరింత పెంచాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు సూచించాయి.

అదీకాక భారత్లో వక్ఫ్ సవరణ బిల్లు ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందింది. సదరు బిల్లు ఆమోదాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ.. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు.. పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మర్షీదాబాద్ జిల్లాలో ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడానికి బంగ్లాదేశ్లోని దుండగులు కారణమంటూ కేంద్రానికి నిఘా వర్గాలు ఇప్పటికే నివేదిక అందించింది. ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులకు నిఘా వర్గాలు తాజాగా వివరించాయి.
ఈ నేపథ్యంలో భారత్లో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్న భారత్ భూభాగంగా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దాంతో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉందంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాధారాల ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pehalgam Terror Attack: పాక్కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్
For National News And Telugu News