Share News

Madhya Pradesh: కూతురు బతికి ఉండగానే అంత్యక్రియలు.. ఎందుకంటే?

ABN , Publish Date - Dec 22 , 2025 | 08:18 AM

ఎవరైనా చనిపోతే వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంటారు. కానీ.. ఓ తండ్రి తన కూతురు బతికి ఉండగానే ఆమెకు శ్మశానంలో లాంఛనప్రాయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది.

Madhya Pradesh: కూతురు బతికి ఉండగానే అంత్యక్రియలు.. ఎందుకంటే?
Father Performs Funeral for Living Daughter

మధ్యప్రదేశ్‌లోని విదిషలో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఒక తండ్రి తన 23 ఏళ్ల కుతురుకి వారి ఆచార పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించాడు. పిండితో ఆమె బొమ్మను తయారు చేసి దానికి కర్మలు చేశాడు. విచిత్రం ఏంటంటే ఆ కూతురు బతికే ఉంది. గ్రామంలో ఈ విషయం తెలిసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు విషయానికి వస్తే.. సవితా కుష్వాహ కొన్ని రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు ఇలా అందరినీ వాకబు చేశారు. చివరికి ఆమె ఒక యువకుడితో వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. దాంతో సవితకు కుటుంబం సభ్యులు షాక్ తిన్నారు.


తమ కూతురు చేసిన పనికి గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి.. తమ కూతురు చనిపోయింది..ఆమెకు తమ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పిండితో సవిత దిష్టిబొమ్మ తయారు చేశారు, దాన్ని పాడెపై మోసుకుంటూ గ్రామంలో ఊరేగించారు. శ్మశానవాటికకు వెళ్లి ఆ బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా విచ్చేశారు. ఈ విషయం గురించి సవిత తండ్రి మాట్లాడుతూ..నా కూతురుని ఎంతో ప్రేమతో చూసుకున్నాం, ఆమె అడిగిన ప్రతి ఒక్కటీ ఇప్పించాం. నా కూతురు చేసిన పనికి మేం అవమానంతో కుంగిపోయాం..నా జీవితంలో అత్యంత విషాదకరమైన క్షణం. ఆమె మా దృష్టిలో చనిపోయింది.. అందుకే అంత్యక్రియలు చేశాం అని అన్నారు.


ఇవీ చదవండి:

రైలు టికెట్ల ధరల పెంపు!

బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు

Updated Date - Dec 22 , 2025 | 08:56 AM