DK Shivakumar: అంతా ఉచితమంటే పాలన సాగేదెలా?
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:43 AM
జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని, కావేరి నీటిని కూడా ఉచితంగా ఇవ్వమంటే ఎలా సాధ్యమని శివకుమార్ ప్రశ్నించారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
బెంగళూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న ఐదు ఉచిత గ్యారెంటీలతో కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతోందని, ఇంకా ఉచితమంటే ప్రభుత్వాన్ని ఎలా నడపాలని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని, కావేరి నీటిని కూడా ఉచితంగా ఇవ్వమంటే ఎలా సాధ్యమని శివకుమార్ ప్రశ్నించారు. ఎంతోకొంత బిల్లు చెల్లించాలి కదా అన్నారు. జలమండలికి ఏటా రూ.వెయ్యి కోట్ల నష్టం వస్తోందని, నీటి చార్జీలు పెంచడం అనివార్యమని స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న జలమండలికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదని తెలిపారు.