Kumbh Mela: కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:19 AM
శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. సోమవారం వసంత పంచమి నేపథ్యంలో 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేడు వసంత పంచమి నేపథ్యంలో మరింత రద్దీ..
అయోధ్య, ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 2: మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. సోమవారం వసంత పంచమి నేపథ్యంలో 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. కోల్డ్ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ తన స్నేహితురాలు డకోటా జాక్సన్తో కలిసి కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానమాచరించారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి