Tamil Nadu: సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:07 AM
తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు సాధన చేశారని పీఠం మేనజరు మూర్తి రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఠ పురోహితులు మాచవోలు రమేశ్ శర్మ ఆధ్వర్యంలో ఈ పట్టాభిషేకం నిర్వహించారు.
చెన్నై, జూన్ 7: తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతులుగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు సాధన చేశారని పీఠం మేనజరు మూర్తి రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఠ పురోహితులు మాచవోలు రమేశ్ శర్మ ఆధ్వర్యంలో ఈ పట్టాభిషేకం నిర్వహించారు. దత్తేశ్వరానంద భారతి స్వామి కుర్తాళ పీఠ వైభవాన్ని ముందుకు తీసుకెళ్తారని సిద్దేశ్వరి పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంఎల్సీ, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభివాణి, అధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..