Share News

Ceasefire Violations: ఎల్వోసీ వెంట 8 చోట్ల పాక్‌ కాల్పులు

ABN , Publish Date - May 05 , 2025 | 04:52 AM

పాకిస్థాన్‌ వరుసగా పదో రోజూ ఎల్వోసీపై కాల్పులకు పాల్పడుతోంది. భారత్‌, పాకిస్థాన్‌ పరస్పరంగా పోర్టులకు నౌకల ప్రవేశాన్ని నిషేధించాయి.

Ceasefire Violations: ఎల్వోసీ వెంట 8 చోట్ల పాక్‌ కాల్పులు

న్యూఢిల్లీ, మే 4: పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉంది. వరుసగా పదో రోజూ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట కాల్పులు జరిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంఛ్‌, రాజౌరీ, మెంధర్‌, నౌషేరా, సుందర్‌బని, అఖ్నూర్‌ ప్రాంతాల్లో చిన్నస్థాయి ఆయుధాలతో కాల్పులకు పాల్పడినట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. భారత సైన్యం కూడా దీటుగా బదులిచ్చిందని తెలిపాయి. భారత పోర్టుల్లోకి పాక్‌ నౌకలు రాకుండా నిషేధించిన నేపథ్యంలో.. పాకిస్థాన్‌ కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్‌కు చెందిన, భారత జెండా ఉన్న నౌకలేవీ పాక్‌ పోర్టుల్లోకి రాకుండా నిషేధించింది. పాక్‌ నౌకలేవీ భారత పోర్టులకు వెళ్లవద్దంటూ ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:52 AM