Gold ATM: ఏటీఎంలో బంగారం వేస్తే బ్యాంకు ఖాతాలో నగదు జమ
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:47 AM
బంగారం జమ చేస్తే దాని విలువను ఖాతాలో జమ చేసే వినూత్న ఏటీఎంను చైనా షాంగైలో ఏర్పాటు చేసింది. బంగారం స్వచ్ఛత, బరువు ఆధారంగా మార్కెట్ ధరకు అనుగుణంగా సొమ్ము జమ చేస్తుంది.
చైనాలో నూతన ఆవిష్కరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: వినూత్న ఆవిష్కరణల్లో ముందున్న చైనా మరో ప్రయోగాన్ని చేసింది. ఎవరైనా ఏటీఎంలో తమ బంగారాన్ని వేస్తే దాని మార్కెట్ విలువ సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు చేసింది. షాంగైలో ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ను నెలకొల్పింది. ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారం నగలు, కాసులు వంటివి ఈ ఏటీఎంలో జమ చేయవచ్చు. వెంటనే దాన్ని కరిగించి స్వచ్ఛతను లెక్కిస్తుంది. అత్యాధునిక తూనిక విధానం ద్వారా దాని బరువును కొలుస్తుంది. ఆ రోజుకు ఉన్న మార్కెట్ ధరల ప్రకారం దాని విలువను లెక్కిస్తుంది. ఆ సొమ్మును సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News