BSF: బీఎస్ఎఫ్ అదుపులో పాకిస్థానీ రేంజర్
ABN , Publish Date - May 04 , 2025 | 04:41 AM
రాజస్థాన్లో ఓ పాకిస్థాన్ రేంజర్ను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. గత వారం పొరపాటున సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ను పాక్ సైన్యం ఇంకా విడుదల చేయకపోవడంతో ఇది ప్రతీకార చర్యగా చేపట్టారు.
న్యూఢిల్లీ, మే 3: సరిహద్దుల వద్ద విధులు నిర్వహించే పాకిస్థాన్కు చెందిన ఓ రేంజర్ను బీఎ్సఎఫ్ అదుపులోకి తీసుకొంది. రాజస్థాన్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు శనివారం అధికార వర్గాలు తెలిపాయి. గత బుధవారం పొరపాటున సరిహద్దు దాటిన బీఎ్సఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకొంది. అతడి సమాచారం ఏదీ ఇంకా వెల్లడి కాలేదు. ఎనిమిది రోజులుగా రెండు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దానికి ప్రతీకారంగానే పాక్ జవాన్ను బీఎ్సఎఫ్ అదుపులోకి తీసుకొంది. ఇరు దేశాల సైనికులు పొరపాటున సరిహద్దులు దాటడం సర్వసాధారణం. మిలటరీ అధికారులు చర్చలు జరిపి వారిని విడిచిపెడుతుంటారు. కానీ పహల్గాం దుర్ఘటన కారణంగా పాకిస్థాన్ జాప్యం చేస్తుండడంతో బీఎ్సఎఫ్ కూడా అదే రీతిలో వ్యవహరించింది.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..