లోక్సభ ఎన్నికల వ్యయంలో బీజేపీనే టాప్
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:08 AM
గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసిందని.. ఇది మొత్తం ఎన్నికల వ్యయంలో 44.56 శాతమని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 20: గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసిందని.. ఇది మొత్తం ఎన్నికల వ్యయంలో 44.56 శాతమని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం తెలిపింది. కాంగ్రెస్ రూ.620 కోట్లు ఖర్చు చేసి 18.5 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
32 జాతీయ, ప్రాంతీయ పార్టీల రికార్డులను విశ్లేషించి ఏడీఆర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘గతేడాది మార్చి 16 నుంచి జూన్ 6 వరకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగ్గా, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వీటితో పాటే జరిగాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీలు కలిపి రూ.3,352.81 ఖర్చు చేశాయు.