Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Feb 11 , 2025 | 11:29 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • Feb 11, 2025 12:31 IST

    వైసీపీలోకి కీలక నేత..

    • తిరుపతి: వైసీపీలోకి గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు.

    • రేపు జగన్ సమక్షంలో గాలి జగదీష్ వైసీపీలో చేరే అవకాశం.

    • జగదీష్ చేరికపై రోజాకు సమాచారం ఇవ్వలేదని ప్రచారం.

    • నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలనే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం.

  • Feb 11, 2025 12:16 IST

    వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం..

    • ఢిల్లీ: వామనరావు దంపతుల హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ.

    • కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టడానికి అభ్యంతరం లేదన్న సీబీఐ న్యాయవాది.

    • కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడానికి.. తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.

    • తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారన్న పుట్టమధు తరఫు లాయర్లు.

    • ఇద్దరు న్యాయవాదులను కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారని, సంబంధించిన వీడియోలు ఉన్నాయని తెలిపిన కిషన్‌రావు తరఫు లాయర్లు.

    • హత్య దృశ్యాలకు మించిన సాక్ష్యాలు ఏం కావాలన్న న్యాయవాది.

    • మరణ వాగ్మూలంలో ఎవరి పేరు చెప్పలేదన్న పుట్టమధు లాయర్లు.

    • వివరాలు సమర్పించేందుకు గడువు కోరిన పుట్టమధు న్యాయవాదులు.

    • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.

  • Feb 11, 2025 12:06 IST

    ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

    • అమరావతి: మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం.

    • సచివాలయంలో సెక్రటరీల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు.

    • ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు.

    • మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

    • ఏడుగురు చనిపోయారని వస్తున్న వార్తలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    • ప్రస్తుతం తెలుగు ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

  • Feb 11, 2025 11:29 IST

    మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలో సిహోరా వద్ద ఘోర ప్రమాదం.

    • NH-30పై బస్సును ఢీకొట్టిన ట్రక్కు.

    • కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం.

    • సిహోరా దగ్గర బస్సును ఢీకొట్టిన ట్రక్కు

    • ఏడుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘటన

    • మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తింపు