Morning Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తీసుకోవాలో తెలుసా?
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:04 AM
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా పానీయాలు, ఆహార పదార్ధాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఉదయం తీసుకునే ఆహార పదార్ధాలు మీ ఆరోగ్యం, శక్తి స్థాయి మీద చాలా ప్రభావం చూపుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా ఉండేవాటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరం చల్లగా ఉంటుంది కాబట్టి తీసుకునే పానీయాలు, ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి, ఉదయం ఖాళీ కడుపుతో వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరువెచ్చని నీరు:
రోజును ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటితో ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇది జీవక్రియను సక్రియం చేస్తుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు.
జీలకర్ర నీరు:
ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష:
రాత్రిపూట నానబెట్టిన నాలుగు లేదా ఐదు 5 బాదం పప్పులు, కొన్ని ఎండుద్రాక్షలు తినడం చాలా మంచిది. బాదంపప్పు మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్ష శరీరంలో ఐరన్ కంటెంట్ను, శక్తి స్థాయిలను పెంచుతుంది.
పండ్లు :
కొంతమంది పోషకాహార నిపుణులు ఉదయం ఖాళీ కడుపుతో కాలానుగుణ పండ్లు (బొప్పాయి, ఆపిల్, అరటిపండు వంటివి) లేదా డ్రై ఫ్రూట్స్ తినాలని సిఫార్సు చేస్తారు. ఇది శరీరానికి సహజ చక్కెర, ఫైబర్, సూక్ష్మపోషకాలను అందిస్తుంది. ఇవి రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో వీటిని తినకండి..
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఫ్రిజ్ నుండి చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉదయాన్నే చల్లటి వస్తువులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
ఖాళీ కడుపుతో వేయించిన ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..
ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..
For More Health News