Share News

Narayaneeyam: సంపూర్ణ నారాయణీంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:05 AM

అనకాపల్లిలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణ మాధురీయం బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పారాయణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు.

Narayaneeyam: సంపూర్ణ నారాయణీంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Narayaneeyam Parayanam

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దాదాపు 15వేల మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పారాయణీయం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. శ్రీకృష్ణ మాధురీయం బృందం వారిచే నిర్వహించిన ఈ పారాయణీయం కార్యక్రమంలో భక్తులు పాల్గొని నారాయణీయం పారాయణ చేశారు.


స్థానిక శ్రీమతి కడ్మిశెట్టి నాగ మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఈ భక్తిపారాయణంకు నారాయణీయం సాధకులు, పురజనులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు పారాయణ ప్రారంభమై, 4 గంటలకు గౌరవ సభ నిర్వహించారు. అనకాపల్లిలోని గవరపాలెం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్‌లో జరిగిన ఈ వేడుక స్థానికంగా ఆధ్యాత్మిక శోభను సంతరింపచేసింది.

Anakapalli-Narayaneeyam.jpg


అనకాపల్లి జిల్లా అనకాపల్లికి చెందిన కడ్మిశెట్టి నాగ మాధురి నవీన్, ఆధ్వర్యంలో శ్రీమన్ నారాయణీయం నుండి 1,036 శ్లోకాలతో కూడిన భారీ సమూహిక పఠనాన్ని విజయవంతంగా నిర్వహించి, నాయకత్వం వహించారని ధృవీకరించినట్టు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.

Sampoortna-narayaneeyam.jpgసాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థ అయిన 'శ్రీ కృష్ణ మాధురియం' ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్త బృందం, అద్భుతమైన సమన్వయం, సమిష్టి భాగస్వామ్యం, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పరిరక్షించడంలో అంకితభావాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తించబడిందని సదరు సంస్థ వెల్లడించింది.

Anakapalli-parayanam.jpgతెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ ఆధ్యాత్మిక క్రతువును సగర్వంగా గుర్తిస్తుందని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..

పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

Updated Date - Dec 28 , 2025 | 12:44 PM