Share News

అయ్యో అనుప్రియ.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 28 , 2025 | 11:15 AM

అత్త మందలించిందంటూ.. కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. అనుప్రియ అనే మహిళ అశ్విన్‌రాజ్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే.. ఐస్‌క్రీమ్‌ కింద పడిందని అత్త మందలించడంతో కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళితే...

అయ్యో అనుప్రియ.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

  • ఐస్‌క్రీమ్‌ కింద పడిందని మందలించిన అత్త.. కోడలు ఆత్మహత్య

చెన్నై: అత్త దూషించడంతో కోడలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెడ్‌హిల్స్‌ సమీపంలో చోటుచేసుకుంది. రెడ్‌హిల్స్‌ సమీపం మొండియమ్మన్‌ నగర్‌ ఔన్సాంగ్‌ వీధికి చెందిన అశ్విన్‌రాజ్‌-అనుప్రియ (27) పెద్దల అనుమతితో రెండున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. సోమవారం ఉదయం ఫ్రిజ్‌ నుంచి ఐస్‌క్రీమ్‌ కింద పడడంతో, అత్త చిత్ర కోడలిని మందలించినట్లు సమాచారం.


nani2.2.jpg

దీంత, మనస్తాపం చెందిన అనుప్రియ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రెడ్‌హిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఘటనపై కేసు నమోదుచేశారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు

Read Latest Telangana News and National News

Updated Date - May 28 , 2025 | 11:15 AM