TCS salary hike 2025: టీసీఎస్ ఉద్యోగుల జీతం పెంపు
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:58 AM
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మెజారిటీ సిబ్బంది వేతనాలను 4.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది...
4.5 - 7% శ్రేణిలో పెరుగుదల
సెప్టెంబరు నుంచి అమలు
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మెజారిటీ సిబ్బంది వేతనాలను 4.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబరు నెల నుంచి జీతం పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ పత్రాలు అందజేసే ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచే ప్రారంభమైందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. కింది, మధ్య స్థాయి సిబ్బంది అందరికీ వేతనం పెరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారికి వేతనాన్ని 10 శాతానికి పైగా పెంచినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి