SEBI Action: డిహెచ్ఎఫ్ఎల్ కేసులో వధావన్ సోదరులపై సెబీ నిషేధం
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:16 AM
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎ్ఫఎల్) మాజీ సీఎండీ కపిల్ వధావన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వధావన్తో పాటు మరో నలుగురిపై సెబీ భారీ వేటు వేసింది...
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎ్ఫఎల్) మాజీ సీఎండీ కపిల్ వధావన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వధావన్తో పాటు మరో నలుగురిపై సెబీ భారీ వేటు వేసింది. కంపెనీ నిధులను మళ్లించడంతో పాటు అకౌంటింగ్ అక్రమాలకు పాల్పడినందుకుగాను వారిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్ల వరకు నిషేధించడమే కాకుండా రూ.120 కోట్ల జరిమానా కూడా విధించింది. అంతేకాదు, వారిని ఐదేళ్లపాటు ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక పదవిని చేపట్టకుండా నిషేధిస్తున్నట్లు మంగళవారం సెబీ ఆదేశాలు జారీ చేసింది. కపిల్, ధీరజ్లతోపాటు డీహెచ్ఎఫ్ఎల్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ వధావన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారంగ్ వధావన్, మాజీ జాయింట్ ఎండీ, సీఈఓ హర్షిల్ మెహతా, మాజీ సీఎ్ఫఓ సంతోష్ శర్మపైనా సెబీ వేటు పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News