RBI MPC Meeting: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై మరో 0.25 శాతం కోత విధించిన ఆర్బీఐ
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:24 AM
ఆర్బీఐ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మరోసారి గుడ్ న్యూస్ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను(RBI Interest Rates) మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు.
అయితే.. ఈ ఏడాదిలో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆ తర్వాత జూన్ నెలలో మరోసారి ఏకంగా 50 పాయింట్ల మేర కోత విధించింది. దీంతో 2025 ఏడాదిలోనే మొత్తం రెపో రేటు 1.25 మేర తగ్గింది.
ఇవీ చదవండి:
5: పసిడి ధరల్లో తగ్గుదల.. స్థిరంగా వెండి
కొత్త ఏడాది పసిడి బుల్ రన్ ఆగదు