Stock Market: కొనసాగిన నష్టాలు.. వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే సెన్సెక్స్..
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:12 PM
బుధవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే నెలవారీ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో ఈ రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో పయనించాయి. మంగళవారం ఉదయమంతా లాభాల్లోనే కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి నష్టాల బాట పట్టాయి. బుధవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే నెలవారీ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో ఈ రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 900)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు వంద పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత చివరి గంటలో నష్టాల్లోకి జారుకుంది. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాలతో రోజును ముగించాయి. చివరకు సెన్సెక్స్ 313 పాయింట్ల నష్టంతో 84, 587 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 74 పాయింట్ల నష్టంతో 25, 884 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్లో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, ఫియోనిక్స్ మిల్స్, గోద్రేజ్ కన్జ్యూమర్, ఫెడరల్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). అదానీ ఎంటర్ప్రైజెస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఐజీఎల్, డిక్సన్ టెక్నాలజీస్, టీఎప్పీమీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 216 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.22గా ఉంది.
ఇవీ చదవండి:
డిసెంబర్లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్మెంట్పై అవగాహన కల్పించండి!