Gold Rate on Aug 30: బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేటి రేట్స్ ఇవీ
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:49 AM
ఓవైపు పండుగ సీజన్ మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్లో కోత ఉంటుందన్న అంచనాలు వెరసి భారత్లో బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయి. మరి నేడు దేశంలో బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పండుగ సీజన్తో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,03,320కు చేరుకుంది (Gold Rate on Aug 30). ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,710, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.77,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,800కు చేరుకుంది. ప్లాటినం ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.38,160కు చేరింది.
దేశంలో పండుగ సీజన్తో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనా బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) రేట్స్
చెన్నై: ₹1,03,320; ₹94,710; ₹78,310
ముంబయి: ₹1,03,320; ₹94,710; ₹77,490
ఢిల్లీ: ₹1,03,470; ₹94,860; ₹77,620
కోల్కతా: ₹1,03,320; ₹94,710; ₹77,490
బెంగళూరు: ₹1,03,320; ₹94,710; ₹77,490
హైదరాబాద్: ₹1,03,320; ₹94,710; ₹77,490
కేరళ: ₹1,03,320; ₹94,710; ₹77,490
పుణె: ₹1,03,320; ₹94,710; ₹77,490
వడోదరా: ₹1,03,370; ₹94,760; ₹77,540
అహ్మదాబాద్: ₹1,03,370; ₹94,760; ₹77,540
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,29,800
ముంబయి: ₹1,19,800
ఢిల్లీ: ₹1,19,800
కోల్కతా: ₹1,19,800
బెంగళూరు: ₹1,19,800
హైదరాబాద్: ₹1,29,800
కేరళ: ₹1,29,800
పుణె: ₹1,19,800
వడోదరా: ₹1,19,800
అహ్మదాబాద్: ₹1,19,800
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
ఏఐ సరికొత్త కామధేనువు: ముఖేశ్ అంబానీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి