Visakhapatnam : ఎన్ఎస్టీఎల్ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:02 AM
భారత నౌకాదళం కోసం విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) అత్యాధునిక లైట్ వెయిట్ టార్పెడోను
విశాఖపట్నం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం కోసం విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) అత్యాధునిక లైట్ వెయిట్ టార్పెడోను అభివృద్ధి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ కింద చేస్తున్న ఈ ప్రాజెక్టు వివరాలను ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ సింపోజియంలో సమర్పించగా... దీనికి ‘నేషనల్ ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ అవార్డు-2024’ లభించింది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఈ అవార్డును అందజేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావును, బృందాన్ని నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ ఆర్వీ హరప్రసాద్, ఎన్ఎ్సటీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం అభినందించారు.