Alluri District Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:22 AM
అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 8 మంది ప్రయాణీకులు మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
వార్త అప్డేట్ అవుతోంది..