Share News

Temperature:పెరిగిన ఉష్ణోగ్రత.. కర్నూలులో 38.2 డిగ్రీలు

ABN , Publish Date - Feb 25 , 2025 | 06:36 AM

రాష్ట్రంలో ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతోంది. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు పొడి గాలులు వీస్తున్నాయి.

Temperature:పెరిగిన ఉష్ణోగ్రత.. కర్నూలులో 38.2 డిగ్రీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతోంది. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు పొడి గాలులు వీస్తున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తాల్లోని అనేక ప్రాంతాల్లో సోమవారం వేడి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Feb 25 , 2025 | 06:37 AM