TDP: 18న టీడీపీపీ భేటీ
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:02 AM
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు 16 మందితోపాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరవుతారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.