Share News

Tulasi Reddy: స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు హర్షణీయం

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:38 AM

కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర..

Tulasi Reddy: స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు హర్షణీయం

వేంపల్లె, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. కాగా.. ఆహారం, నీటి కొరత కారణాల వల్ల ఏనుగులు అడవులను వదిలి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను తిని, తొక్కి నాశనం చేయడమే కాకుండా రైతులను తొక్కి చంపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడిలో పలువురు రైతులు చనిపోగా 300ఎకరాలలో పంట ధ్వసంమైందన్నారు. ఏనుగుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:38 AM