Share News

Unique Disability ID: దివ్యాంగులకు ఇకపై యూడీఐడీ కార్డులు

ABN , Publish Date - May 17 , 2025 | 04:12 AM

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. సదరం, యూడీఐడీ పోర్టల్స్‌ను మీసేవ, మనమిత్ర వాట్సాప్ ద్వారా అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్ ద్వారా ఒక నెలలో సర్టిఫికెట్లు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

Unique Disability ID: దివ్యాంగులకు ఇకపై యూడీఐడీ కార్డులు

సదరం పోర్టల్‌తో కేంద్ర పోర్టల్‌ అనుసంధానం: మంత్రి డోలా

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యునిక్‌ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ)లు ఇకపై రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్‌ స్కీంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం పోర్టల్‌ను యూడీఐడీ పోర్టల్‌ను అనుసంధానం చేసి స్లాట్‌ బుకింగ్‌కి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల్లోపు దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు యూడీఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

మూడు రంగుల్లో కార్డులు

దివ్యాంగ శాతం 40 కన్నా తక్కువగా ఉంటే తెలుపు కార్డు, 40% నుంచి పైబడి 80ులోపు ఉన్న వారికి పసుపు రంగు కార్డు, దివ్యాంగ శాతం 80 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి నీలం రంగు కార్డును జారీ చేస్తారు


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:12 AM