Share News

Sharmila: కేంద్రమే మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , Publish Date - May 05 , 2025 | 05:39 AM

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని మోదీ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు తుస్సుమనిపించాయని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మోదీ యొక్క చర్యలను తప్పుపట్టారు.

Sharmila: కేంద్రమే మౌలిక సదుపాయాలు కల్పించాలి

పీసీసీ చీఫ్‌ షర్మిల డిమాండ్‌

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): అమరావతిపై ప్రధాని మోదీ మాటలు కాలని చిచ్చుబుడ్డిలా తుస్సుమనిపించాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. మోదీ ఈసారైనా అమరావతిని కట్టేనా లేదా మళ్లీ మట్టేనా? అంటూ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణానికి వచ్చిన ప్రధానికి తన కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకు మట్టిని పంపిస్తున్నామని తెలిపారు. రాజధానిలో మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా ప్రధాని ప్రకటించలేదని ఆక్షేపించారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ, కేఎ్‌ఫడబ్ల్యూ, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నించారు.తున్నారని ఆమె ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 05:39 AM