Sindoor Support Rally: ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల ర్యాలీ
ABN , Publish Date - May 10 , 2025 | 05:37 AM
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా అమరావతిలో సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ‘జయహో ఆపరేషన్ సిందూర్’, ‘జై జవాన్’, ‘అమర్ రహే మురళీనాయక్’ నినాదాలతో దేశభక్తిని చాటారు

పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా శుక్రవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జయహో ఆపరేషన్ సిందూర్, జై జవాన్, జై భారత్ నినాదాలతో సచివాలయం నుంచి ప్రధాన గేటు వరకూ ర్యాలీ నిర్వహించారు. పాక్ కాల్పుల్లో అమరుడైన రాష్ట్రానికి చెందిన అగ్నివీర్ మురళీనాయక్ అమర్ రహే అంటూ ఉద్యోగులు నినదించారు.
- అమరావతి, ఆంధ్రజ్యోతి