Liquor Scam: లిక్కర్ నిందితులపై..రెడ్ కార్నర్ నోటీసులు!
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:24 AM
వేల కోట్ల మద్యం దోపిడీ సొమ్మును దేశం దాటించిన పాత్రధారులు యూఏఈ ..
దుబాయ్లో ఆరుగురు.. థాయ్లో ముగ్గురు
9 మంది వివరాలు కోర్టుకు అందజేసిన సిట్
ఇంటర్పోల్ సాయం కోసం సీబీఐతో సంప్రదింపులు.. ఈడీ సహకారం కూడా..
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వేల కోట్ల మద్యం దోపిడీ సొమ్మును దేశం దాటించిన పాత్రధారులు యూఏఈ (దుబాయ్), థాయ్లాండ్ దేశాల్లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు.. లిక్కర్ కేసు నమోదు కాగానే విమానాల్లో విదేశాలకు చెక్కేసిన తొమ్మిది మంది మద్యం ముఠా సభ్యులను దేశానికి రప్పించే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందడుగు వేసింది. ఇంటర్పోల్ సాయంతో వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే కోర్టుకు తెలియజేసిన అధికారులు.. వారిపై రెడ్కార్నర్ నోటీసు జారీచేయించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈడీ సహకారం కూడా తీసుకోనున్నారు. 9 మంది నిందితుల్లో ఆరుగురు.. టి.ఈశ్వర్ కిరణ్కుమార్రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్, బొల్లారం శివకుమార్, కొల్లిపురి మోహన్, ప్రద్యుమ్న ఒంగోలు, రాజీవ్ ప్రతాప్ పింగళి దుబాయ్లో ఉండగా.. మరో ముగ్గురు.. ముప్పిడి అవినాశ్రెడ్డి, ముప్పిడి అనిరుధ్రెడ్డి, కొమ్మారెడ్డి అవినాశ్రెడ్డి థాయ్లాండ్లో మకాం వేశారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!