Nara Bhuvaneswari: డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు భువనేశ్వరి ఎంపిక
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:15 PM
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఐఓడీ శుక్రవారం వెల్లడించింది.
అమరావతి, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్-2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న నారా భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసినట్లు ఐఓడీ వివరించింది. ప్రజాసేవతోపాటు సామాజిక ప్రభావిత అంశాల్లో కీలకంగా పని చేసినందుకే కాకుండా.. సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన బ్రిటన్ రాజధాని లండన్లో గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి ఈ అవార్డును నారా భువనేశ్వరి అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డను భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ - వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా తదితర దిగ్గజ వ్యక్తులు అందుకున్నారు. నారా భువనేశ్వరికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు.. బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో అమెను సన్మానించి.. శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కీలక నిర్ణయం.. రూ. 60 కోట్లు విడుదల
For More AP News And Telugu News