విశాఖ, బెజవాడ మరణాలపై విచారణ: సత్యకుమార్
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:48 AM
విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన 63 ఏళ్ల మహిళ రేణుక విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు.
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ, విజయవాడ జీజీహెచ్ల్లో మహిళల మరణాలపై లోతైన విచారణ జరపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన 63 ఏళ్ల మహిళ రేణుక విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. జీబీఎస్ లక్షణాలతో ఈ నెల 6న కేజీహెచ్లో చేరిన ఆమె చికిత్స పొందుతూ 17న మృతిచెందారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా జి.కోడూరుకు చెందిన 35 ఏళ్ల సునీత తీవ్ర ఆనారోగ్య సమస్యలతో సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ వెంటనే ఆమె మరణించారు. ఈ రెండు సంఘటనలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహంను ఆదేశించారు.