Pemmassani Chandrasekhar: అధికారులూ స్వేచ్ఛగా పనిచేయండి
ABN , Publish Date - May 27 , 2025 | 05:33 AM
ప్రజా సమస్యలపై అధికاریలు పూర్తి బాధ్యతతో స్పందించాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. సమస్యలుగా కాకుండా, ప్రజల జీవితాలుగా చూడాలని, ప్రభుత్వం ప్రతిష్ఠ అధికారుల చేతుల్లోనే ఉంటుందన్నారు.
గుంటూరు(తూర్పు), మే 26 (ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుని, సమస్యలను పరిష్కరించాలి’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ భార్గవతేజతో కలసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ... ‘అవి సమస్యలు కావు.. వారి జీవితాలు. దీనిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా అధికారుల చేతుల్లోనే ఉంటుంది’ అన్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News