Share News

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:26 AM

: పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

  • పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పాలన: నాదెండ్ల

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. మంగళవారం విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులు, రైస్‌ మిల్లర్లు, గొడౌన్ల నిర్వాహకులు, ఎల్పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ ప్రతినిధులతో విడివిడిగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో దుర్వినియోగం, అక్రమాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గొడౌన్లలో నిల్వ చేసే సరుకుల పర్యవేక్షణకు సివిల్‌ సప్లయిస్‌, ప్రైవేట్‌ గొడౌన్ల వద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 05:26 AM