Share News

వైభవంగా భీష్మ ఏకాదశి వేడుకలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:51 AM

మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో కాకనూరు శారదామఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో 66వ భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా భీష్మ ఏకాదశి వేడుకలు
హోమం నిర్వహిస్తున్న పీఠాధిపతులు, పురోహితులు

కొత్తపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో కాకనూరు శారదామఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో 66వ భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రెండో రోజు మంగళవారం తెల్లవారుజామున మంగళవాయిద్యాలతో అమ్మవారిని మేలుకొలువు, పంచామృతాభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, మహానివేదన, అనంతరం క్షేత్ర ప్రాంగణంలో శ్రీలక్ష్మి గణపతి హోమం, సరస్వతి, చండీ హోమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Feb 12 , 2025 | 12:51 AM