Share News

Cyclone Montha: గంటకు 12 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మొంథా

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:22 PM

గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, విశాఖపట్నానికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclone Montha: గంటకు 12 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మొంథా
Cyclone Montha

అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుపాను (Cyclone Montha) ఆంధ్రా వైపుకు ఎంతో వేగంగా దూసుకొస్తోంది. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానుగా బలపడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, విశాఖపట్నానికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.


ఈరోజు (మంగళవారం) రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

కేడర్ నుంచి లీడర్ వరకు కదలి రండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:35 PM