Share News

High Court: నాపై కేసులు కొట్టేయండి

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:44 AM

ఈ కేసుల్లో తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. టీడీపీ నేతలను వదిలిపెట్టేది లేదని, పోలీసుల పాపాలు వారికి శాపాలు గా మారుతాయంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఒంటేరు ప్రసన్నకుమార్‌ ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణ పోలీసులు కేసు నమో దు చేశారు.

 High Court: నాపై కేసులు కొట్టేయండి

హైకోర్టులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిటిషన్లు

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కావలి, వేదాయపాలెం పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. టీడీపీ నేతలను వదిలిపెట్టేది లేదని, పోలీసుల పాపాలు వారికి శాపాలు గా మారుతాయంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఒంటేరు ప్రసన్నకుమార్‌ ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణ పోలీసులు కేసు నమో దు చేశారు. వెంకటాచలం ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పద్మయ్య ఇచ్చిన ఫిర్యాదుపై వేదాయపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:45 AM