Share News

Jogi Ramesh CID Notice: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:03 AM

మాజీ మంత్రి జోగి రమేశ్‌ను దాడి కేసులో సీఐడీ విచారణకు పిలిచింది.ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఏప్రిల్ 11న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు

Jogi Ramesh CID Notice: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

  • చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో రేపు విచారణ

  • జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేశ్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం(11న) విచారణకు పిలిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేశ్‌ భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:04 AM