High Court judge: ఇలవేల్పును దర్శించుకున్న జస్టిస్ చల్లా గుణరంజన్
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:29 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం జంబులపాడులోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని హైకోర్టు అదనపు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

తాడిపత్రి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం జంబులపాడులోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని హైకోర్టు అదనపు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. జస్టిస్ చల్లా గుణరంజన్ ఇదే మండలంలోని చల్లావారిపల్లికి చెందినవారు. తమ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు జంబులపాడుకు వెళ్లిన ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు.