కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయానికి కృషి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:10 AM
పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఉభయ గోదావరి పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో రికార్డుస్థాయి మెజార్టీతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించేందు కు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.గోవింద సత్యనారాయణ సూచించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ స్థాయిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేప

ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు గోవింద సత్యనారాయణ
పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఉభయ గోదావరి పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో రికార్డుస్థాయి మెజార్టీతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించేందు కు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.గోవింద సత్యనారాయణ సూచించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ స్థాయిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి ప్రథమ ప్రాధాన్యత ఓటును వేయాలని అభ్యర్థించాలని తెలిపారు. ఓటర్ వెరిఫికేషన్ ఇప్పటికి 60శాతం పూర్తయిందని, నూరుశాతం పూర్తి చేయాలని సూచించారు. నాన్ లోకల్ ఓటర్లును గుర్తించి వారిని కలిసే కార్యక్రమం చేపట్టాలన్నారు. వర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పట్టబధ్రుల ఓటర్ల మొబైల్ నెంబర్లు సేకరించామన్నా రు. ప్రతి 30మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి వారిని నిరంతం కలిసేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ ప్రతినిఽదులున్నారు.