Cyclonic winds: కరెంటు సరఫరాకు అంతరాయం..
ABN , Publish Date - May 05 , 2025 | 05:33 AM
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం గాలివాన కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించి, కొన్ని గంటల్లోనే దెబ్బతిన్న ఫీడర్లను పునరుద్ధరించారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ
అప్రమత్తంగా ఉండాలని సీఎం, మంత్రి ఆదేశాలు
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం నాటి గాలివాన బీభత్సం కరెంటు సరఫరాకు అంతరాయం కలిగించడంతో పాటు చాలా చోట్ల విద్యుత్తు స్తంభాలు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అయితే తక్షణమే స్పందించిన విద్యుత్తు సిబ్బంది కొన్ని గంటల్లోనే దెబ్బతిన్న ఫీడర్లను, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. రాష్ట్రంలో భారీ గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్తు సరఫరా అంతరాయాలు, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ను ఆదేశించారు. దీంతో ఏపీ విద్యుత్తు పంపిణీ, సరఫరా, ఉత్పత్తి సంస్థలు అప్రమత్తమయ్యాయి. గాలివానలకు చెట్లు విరిగి తీగలపై పడటం వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగినా.. 11 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు దెబ్బతిన్నా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా యుద్ధప్రాతిపదికన స్పందించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఇంధన సంస్థలను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News