Adani solar scam: అదానీ స్కాంపై సీఎం స్పందించాలి: రామకృష్ణ
ABN , Publish Date - May 19 , 2025 | 05:41 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అదానీ సోలార్ వ్యవహారం దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దీనిపై నిష్ప్రభంగా ఉండటం, ప్రజలపై 25 ఏళ్లు విద్యుత్ చార్జీలు పడే అవకాశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతపురం విద్య, మే 18(ఆంధ్రజ్యోతి): ‘దేశంలోనే అతి పెద్ద స్కాం అదానీ సోలార్ వ్యవహారం. ఇది రూ.1.10 లక్షల కోట్ల స్కాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాంపై విచారణ చేసి, చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం అదానీ సోలార్ స్కాంపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. దీనివల్ల ఏపీ ప్రజలపై 25 ఏళ్లు విద్యుత్ చార్జీల భారం పడుతుందని, చంద్రబాబు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి