Share News

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: సీపీఐ

ABN , Publish Date - May 23 , 2025 | 06:53 AM

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మావోయిస్టు అగ్రనేత సహా 27 మంది మృతి చెందిన ఈ ఘటనను హత్యలుగా అభివర్ణించారు.

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: సీపీఐ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు 27 మంది చనిపోయారని, ఇవి ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ 6 హామీల అమలు కోసం జూన్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో తలపెట్టిన ధర్నాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను రామకృష్ణ ఆవిష్కరించారు. జల్లి విల్సన్‌, జి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 06:54 AM