Share News

Andhra Pradesh: మిర్చి రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:34 AM

టమాటా రైతులకు చేయూత ఇచ్చేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. శనివారం, ’పూస కృషి విజ్ఞాన్‌ మేళా 2025’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: మిర్చి రైతులను ఆదుకుంటాం

ధరల పతనంపై దృష్టి సారించాం

టమాటా రైతులకు చేయూతనిస్తాం

రైతులతో చర్చించి త్వరలోనే చర్యలు

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చారు. టమాటా రైతులకు చేయూత ఇచ్చేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. శనివారం, ’పూస కృషి విజ్ఞాన్‌ మేళా 2025’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నామని, రైతులు చింతించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం రైతులతో, రైతు సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను, ముఖ్యంగా పండ్లు, కూరగాయలను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఒక మార్గాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. పంటపోలాల వద్ద ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉన్నాయని, వినియోగదారులు మాత్రం అధిక ధరలకు కొంటున్నారని అన్నారు. ఎవరు ఆ లాభాన్ని తీసుకుంటున్నారని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 05:34 AM